
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య
సూళ్లూరుపేట: ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్రెడ్డిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయంలో భాగమేనని సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటివ సంజీవయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..‘అక్రమ మద్యం కేసు అని.. దానికి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉంది. జగనన్నకు అండగా నిలిచిన వారి పేర్లును రెడ్బుక్లో రాసుకుని వారినే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లుకు పంపిస్తున్నారు. సిట్ అధికారులు చంద్రబాబు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రయివేట్ ముసుగులో మోసం చేయలేదా?. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా..? దీనిపై ఆయనపై కేసు పెడితే ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి’..అని చెప్పారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ చేయలేదా?
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలో వచ్చాక రెడ్బుక్ పాలన చేస్తున్న పెద్ద బాబు, చిన్నబాబుకు ముందుంది ముసళ్ల పండుగ అని సంజీవయ్య అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా కేవలం వైఎస్సార్సీపీ పార్టీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని అరెస్ట్లు మీద అరెస్ట్లు చేస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు జెట్టి వేణుయాదవ్, చిన్న సత్యనారాయణ, స్వామిరెడ్డి, బందిలి మహేష్ అయితా శ్రీధర్, వాకాటి బాబురెడ్డి, నందారెడ్డి, హుస్సేన్, జయకుమార్, పర్వతరెడ్డి రవిరెడ్డి, చిలకా యుగంధర్, సురేష్ పాల్గొన్నారు.