
మాట్లాడుతున్న విజయ డయాగ్నొస్టిక్సెంటర్ చైర్మన్ డాక్టర్ సురేంద్రనాథ్రెడ్డి
తిరుపతి కల్చరల్: రెడ్డి రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ను శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్లు దేశ వ్యాప్తంగా ఉన్నాయని తెలిపారు. 125వ సెంటర్ను తిరుపతిలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక్కడ బోర్ 3టీ ఎంఆర్ఐ, మల్టీ డైమెన్షనల్ సిటీ, గామా కెమెరా, పూర్తి ఆటోమేటెడ్ ల్యాబ్, డిజిటల్ మామోగ్రఫీ వంటి అత్యాధునిక పరికాలు ఉన్నాయని తెలిపారు.
ప్రాథమిక రక్త పరీక్ష నుంచి పూర్తి స్థాయి రోగ నిర్ధారణ పరిశోధనలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేస్తామని పేర్కొన్నారు. సెంటర్ ప్రారంభం సందర్భంగా ఈనెల 28వ తేదీ వరకు ఉచితంగా షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేస్తామన్నారు.