ప్రమాదకర వస్తు రవాణాకు ట్రాకింగ్‌ ఉండాల్సిందే

Tracking Device Mandatory For Carrying Dangerous Or Hazardous Materials Said Ministry Of Road Transport  - Sakshi

న్యూఢిల్లీ: ప్రమాదకరమైన సరుకులను, ముడిపదార్థాలను రవాణా చేసే వాహనాలు లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాలను అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇది తప్పనిసరిగా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 జాతీయ పర్మిట్‌ (అనుమతులు) పరిధిలోకి రాని వాహనాలు ప్రమాదకర వాయువులు, వస్తువులను రవాణా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 2022 సెప్టెంబర్‌ 1 తర్వాత కేటగిరీ ఎన్‌2, ఎన్‌3 వాహనాలకు తయారీ దశలోనే పరికరాలు అమర్చాల్సి ఉంటుంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top