ఆశీర్వాద్‌ మైక్రోకు సెబీ బ్రేకులు | Sebi puts Malappuram Finance arm Asirvad Micro Finance IPO on hold | Sakshi
Sakshi News home page

ఆశీర్వాద్‌ మైక్రోకు సెబీ బ్రేకులు

Jan 11 2024 6:26 AM | Updated on Jan 11 2024 6:26 AM

Sebi puts Malappuram Finance arm Asirvad Micro Finance IPO on hold - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ.. మణప్పురం ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ ఆశీర్వాద్‌ మైక్రో ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్‌సైట్‌లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్‌ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది.

తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్‌ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి.
ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement