సీఎస్​ఆర్​ కింద భారీగా నిధులు ఖర్చు చేసిన రిలయన్స్

Reliance spends Rs 1140 cr under CSR initiatives in 2020 21 - Sakshi

ముంబై: గత ఏడాది నుంచి కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్​ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) కింద భారీగానే నిదులను ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సీఎస్​ఆర్​ కిందరూ.1,140 కోట్లను వెచ్చించింది. ఈ విషయాన్ని సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో తెలిపింది. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న పోరాటంలో రిలయన్స్ గత ఒక సంవత్సరంలోనే ఆరోగ్య సంరక్షణ, మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్, భోజనం, మాస్కుల పంపిణీ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది.

1,000 టన్నుల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసే ప్లాంట్​ను గుజరాత్​లోని జామనగర్​​లో నిర్మించింది. 27 లక్షల మందికి  5.5 కోట్లకు పైగా భోజనాన్ని పంపణీ చేసింది. కోవిడ్ సంరక్షణ, చికిత్స కోసం 2,300 పడకలను ఏర్పాటు చేసింది. 81 లక్షల​ మాస్క్​లను ఫ్రంట్ లైన్​ వర్కర్లకు పంపిణీ చేసింది. కరోనా సేవలకు వినియోగించే ఆంబులెన్స్​లకు 5.5 లక్షల లీటర్ల ఇంధనాన్ని వెచ్చించింది. గ్రామీణాభివృద్ధి, ఆటలు, రిలయన్స్​ ఫౌండేషన్​ తరపున స్కాలర్​షిప్స్​ తదితర అంశాల్లో ఖర్చుచేసింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం ప్రతిరోజూ 1,00,000 పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఉత్పత్తి చేయడానికి గుజరాత్‌లోని సిల్వాస్సాలో ఒక ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నివేదికలో తెలిపింది. 

చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top