Kinara Capital to disburse Rs 800 crore for MSME's in AP and Telangana - Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు

Jun 7 2023 8:05 AM | Updated on Jun 7 2023 10:54 AM

Kinara Capital allocates Rs 800 crore for msmes ap telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిన్‌టెక్‌ కంపెనీ కినారా క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.800 కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించింది. తనఖా లేకుండా ఈ వ్యాపార రుణాలను సమకూరుస్తామని కంపెనీ సీవోవో తిరునవుక్కరసు ఆర్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.

‘తెలుగు రాష్ట్రాల్లో 2016 నుంచి ఇప్పటి వరకు 20,000 పైచిలుకు కంపెనీలకు మొత్తం రూ.1,200 కోట్ల లోన్లు ఇచ్చాం. ఈ కంపెనీల ద్వారా 16,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కినారా వృద్ధిలో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్‌ఎంఈల నుండి సమకూరుతుందని ఆశిస్తున్నాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement