ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి : విచారంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌! | Google CEO Sundar Pichai's Message To Employees Working In Israel - Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి : విచారంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌!

Oct 11 2023 6:07 PM | Updated on Oct 11 2023 7:36 PM

Google Ceo Sundar Pichai Note To Employees In Israel - Sakshi

ఇజ్రాయెల్‌పై హామాస్‌ ఉగ్రదాడిపై ప్రముఖ టెక్‌ దిగ్గజం, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో స్థానిక గూగుల్‌ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తామంటూ ఓ మెసేజ్‌ను షేర్‌ చేశారు. 

ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతలపై సుందార్‌ పిచాయ్‌ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. గూగుల్‌కు చెందిన రెండు ఆఫీసుల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్రికతల నేపథ్యంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఉద్యోగులు భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా నిలుస్తుంది. అదే విధంగా ఇజ్రాయెల్‌లో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’ అని సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement