Daily Stock Market: వీడిన బేర్‌ పంజా.. దుమ్మురేపుతున్న బుల్‌..

Daily Stock Market Update In Telugu  - Sakshi

చైనాలో కరోనా భయాలు వెంటాడుతున్నా ద్రవ్యోల్బణం ఛాయలు వీడకున్నా స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు బేర్‌ పంజా నుంచి తప్పించుకుంది. అమెరికా స్టాక్‌ మార్కెట్లు అందించిన ఉత్సాహం, మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నెలకొన్న సానుకూల వాతావరణంతో గురువారం మార్కెట్‌లో బుల్‌ దుమ్మురేపింది. గత వారం కొనసాగిన అనిశ్చిత్తి కారణంగా నష్టపోయిన సూచీలు మళ్లీ బలపడ్డాయి.

ఈరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌  57,296 పాయింట్ల దగ్గర లాభాలతో మొదలైంది. ఆ తర్వాత ఇదే జోరు కనబరుస్తూ ఓ దశలో 57,790 పాయింట్ల గరిష్టాలను టచ్‌ చేసింది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 701 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధి కనబరుస్తూ 57,521 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 17,245 పాయింట్ల దగ్గర ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top