భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు | Bmw India Launches Flagship Suv X7 At Rs 1.22 Crore | Sakshi
Sakshi News home page

భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు

Jan 18 2023 8:01 PM | Updated on Jan 18 2023 8:09 PM

Bmw India Launches Flagship Suv X7 At Rs 1.22 Crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్‌7 ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్‌ 6 సిలిండర్‌ ఇంజన్‌ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్‌ వర్షన్‌ 5.8 సెకన్లలో, డీజిల్‌ వర్షన్‌ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement