సింగరేణిలో పర్సనల్‌ విభాగం అఽధికారుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో పర్సనల్‌ విభాగం అఽధికారుల బదిలీ

Jun 21 2025 3:59 AM | Updated on Jun 21 2025 3:59 AM

సింగరేణిలో పర్సనల్‌ విభాగం అఽధికారుల బదిలీ

సింగరేణిలో పర్సనల్‌ విభాగం అఽధికారుల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని పర్సనల్‌ విభాగంలో నలుగురు అఽధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో డీవైపీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరరావును బెల్లంపల్లి ఏరియా పర్సనల్‌ విభాగానికి, వెల్పేర్‌ వింగ్‌ కార్పొరేట్‌ డీవైపీఎం జీకే కిరణ్‌కు మార్‌ను కార్పొరేట్‌ ఎడ్యుకేషన్‌ విభాగానికి బదిలీ చేసింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ–3లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా పనిచేస్తున్న వేల్పుల కిశోర్‌ను అదే ఏరియాలోని కేటీకే–1 ఇంక్‌లైన్‌కు, సింగరేణి మెయిన్‌ ఆస్పత్రి సీనియర్‌ పీఓ మండల శ్రీనివాస్‌ను కార్పొరేట్‌ ఏరియా వెల్ఫేర్‌ వింగ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement