మద్యం మత్తులో రాళ్లతో దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో రాళ్లతో దాడి

Jun 17 2025 5:05 AM | Updated on Jun 17 2025 5:05 AM

మద్యం మత్తులో రాళ్లతో దాడి

మద్యం మత్తులో రాళ్లతో దాడి

యువతికి గాయాలు

వేటపాలెం: మద్యం మత్తులో రాళ్లతో దాడి చేసిన ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఈ ఘటన పందిళ్లపల్లిలోని చీరాల–ఒంగోలు రోడ్డు పక్కన పందిళ్లమ్మ దేవస్థానం అర్చి వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొబ్బరిబోండాల దుకాణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యుకుడికి అదే గ్రామానికి చెందిన మురళికి పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి సుబ్రహ్మణ్యం, మురళీ ఇద్దరూ సెల్‌ ఫోన్‌లో ఒకరినొకరు రెచ్చుగొట్టుకొనే విధంగా మాట్లాడుకున్నారు. అనంతరం మురళి మరో ఇద్దరు స్నేహితులను తీసుకొని వచ్చి ఆర్చి వద్ద మద్యం సేవించి సుబ్రహ్మణ్యంతో గొడవ పడే సమయంలో రాళ్లు రువ్వుకున్నారు. అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం అక్క తలకు రాయి తగలడంతో గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్సై కె. జనార్దన్‌ సంఘటనా స్థలానికి వెళ్లి వారిని చెదరగొట్టారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలైన యువతి చీరాల ఏరియా వైద్యశాల్లో చేరి ఔట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొడవ పడిన ముగ్గురు యువకులు వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై జనార్దన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement