
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
యడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. హైవే పరిరక్షణ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా వలపర్ల గ్రామస్తులు మొహమ్మద్, హసీరా దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నహీరా, నసీర్లతో బైక్పై శనివారం గుంటూరు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, యడ్లపాడు సమీపంలోని నక్కవాగు వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొంది. వాహనం అదుపు తప్పి కిందపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డివైడర్ను ఢీకొన్న బైక్...
నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా బైక్పై గుంటూరు వైపు ప్రయాణమయ్యాడు. మద్యం సేవించి ఆపై వేగంలో ఉన్నందున వాహనం అదుపుతప్పి యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో వాహనంతోపాటు బాషా రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.