
బాపట్ల
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లాలో ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. సేకరించిన ధాన్యానికి పౌరసరఫరాల సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరో వైపు రైతులకంటే ఎక్కువగా మిల్లర్ల వద్దే ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి అక్రమాలకు తెరతీసిందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఉన్న అధికారులు మిల్లర్లతో కుమ్మకై ్క ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ధాన్యం సేకరణ తర్వాత 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల నుంచి రెండు నెలల దాటినా డబ్బులు ఇవ్వలేదు. రబీలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఉదాహరణకు చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో మార్చినెల 28వ తేదీన రైతుల నుంచి ప్రభుత్వం దాదాపు 3 వేల బస్తాల ధాన్యం సేకరించింది. ఏప్రిల్ 1న పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడని తెలిసి గ్రామానికి చెందిన 60 మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించారు. దీనికి సంబంధించి రైతులకు రూ.50 లక్షలు చెల్లించాల్సి వుండగా ఇప్పటికి 75 రోజులు దాటుతున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ధాన్యం డబ్బుల కోసం రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఇప్పటికీ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇదుగో ఇస్తాం అదిగోఇస్తామని అధికారులు మాట దాటవేయం మినహా డబ్బులు ఎపుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వడంలేదు.
రబీలో 34,953 టన్నుల ధాన్యం సేకరణ
రబీలో జిల్లా వ్యాప్తంగా 5,490 మంది రైతుల నుంచి 34,953 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.81.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ 3,847 మంది రైతులకు రూ.55.82 కోట్లు చెల్లించారు. ఇంకా 1643 మంది రైతులకు రూ. 25.27 కోట్లు ఇవ్వాల్సివుంది. రైతుల నుంచి ధాన్యం సేకరించి నెలన్నర రోజులకు పైగా అయినా వారికి ప్రభుత్వం డబ్బులు వేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం సేకరించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బస్తా ధాన్యం రూ.1740లకు కొంటామని చెప్పినా రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు. ఒక్క ఖరీఫ్లోనే రైతులు జిల్లా వ్యాప్తంగా 2,16,434 ఎకరాల్లో వరిపంట సాగుచేయగా 5,62,729 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా కట్టింది. అయితే ఖరీఫ్లో ప్రభుత్వం లక్ష టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. వాస్తవానికి ఇందులో సగంఽ ధాన్యాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ నేరుగా రైతులనుంచి సేకరించలేదని విమర్శలున్నాయి. మిగిలిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులనుంచి తక్కువ ధరకు కొన్న మిల్లర్ల నుంచి కొనుగోలు చేసి దానిని కూడా రైతుల నుంచి కొన్నట్లు చూపించినట్లు ఆరోపణలున్నాయి. ఇక రబీలో దాదాపు 35 వేల టన్నుల ధాన్యం సేకరించినట్లు చెబుతున్నా ఇందులోనూ అధికారులు మిల్లర్లు కుమ్మకై ్క అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.
న్యూస్రీల్
జిల్లాలో 34,953 టన్నుల ధాన్యం సేకరణ చెల్లించాల్సిన సొమ్ము రూ.81.09 కోట్లు ఇప్పటివరకూ చెల్లించింది రూ.55.82 కోట్లు ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ.25.27 కోట్లు రెండు నెలలు దాటినా డబ్బులు ఇవ్వని ప్రభుత్వం లబోదిబోమంటున్న అన్నదాతలు
నష్టపోయిన అన్నదాతలు
ఆరు వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు
ప్రభుత్వం గత ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధరకు ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో బయట మార్కెట్లో ధాన్యం బస్తా కేవలం రూ.1300లోపే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్లో కోతల సమయంలోనే తరచూ వర్షాలు కురవడంతో ధాన్యాన్ని ఆరబెట్టి నిలువచేసుకునే వసతి లేకపోవడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో వర్షాల సాకుచూపి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడంతో గత్యంతరం లేక రైతులు మిల్లర్లకు అమ్ముకొని నష్టపోవాల్సి వచ్చింది. పోనీ కొన్న ధాన్యానికై నా ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వక రైతులను ఇబ్బంధి పెట్టింది. మొత్తంగా కూటమి తొలి ఏడాది అటు ఖరీప్ ఇటు రబీలో ధాన్యం రైతులు గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోయారు.

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల