సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

సిద్ధం కావాలి

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

సిద్ధం కావాలి

సిద్ధం కావాలి

‘కూటమి’పై పోరుకు న్యాయవాదులు

పట్నంబజారు: ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సామాజిక బాధ్యతగా న్యాయవాదులు పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ లీగల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్‌ ఇన్‌ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం న్యాయవాదుల సమావేశం పార్టీ జిల్లా విభాగం, లీగల్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై బాధతో బయకు రాలేని పరిస్థితుల్లో న్యాయవాదులు కార్యకర్తలకు భరోసా కల్పించి అండగా నిలిచారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో 300 మందికి అనేక పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. వై.ఎస్‌.జగన్‌ చెప్పిన విధంగా పార్టీని రాష్ట్రం, దేశంలో అతిపెద్ద శక్తిగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో న్యాయవాదులు ఒక మోడల్‌గా తీసుకునే విధంగా గుంటూరు న్యాయవాదులు పనిచేశారని కొనియాడారు.

కార్యకర్తలు, నేతలకు అండగా నిలవాలి

సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఐదేళ్లపాటు కార్యకర్తలు, నేతలకు అండగా నిలవాల్సిన బాధ్యత లీగల్‌ విభాగంపై ఉందని తెలిపారు. పరిపాలన కన్నా, కక్షసాధింపు చర్యలకు కూటమి సర్కార్‌ ప్రాధాన్యత ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఏడాది కాలంలో ఇచ్చిన ధైర్యం అద్భుతమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

న్యాయవాదుల పోరాటం అద్భుతం

ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

మహిళా న్యాయవాదులు స్పందించాలి

పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలిపారు. వై.ఎస్‌.జగన్‌ హయాంలో చట్టానికి లోబడి పరిపాలన కొనసాగిందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళ న్యాయవాదులు స్పందించాలని ఆయన సూచించారు.

తప్పుడు కేసులతో వేధింపులు

డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలు పెట్టడం సరికాదని హితవు పలికారు. ‘సాక్షి’ని మూసివేయించేందుకు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండి పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement