
ఫ్రైట్ డిపో కార్యాలయం ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడులో ఫ్రైట్ డిపో (వ్యాగన్లను మరమ్మతు చేసే కార్యాలయం)ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డివిజన్ డీఆఎర్ం సుధేష్ఠ సేన్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన వ్యాగన్లను మరమ్మతులు చేసే సమయంలో సిబ్బందికి వెయిటింగ్ చేసేందుకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఫ్రైట్ డిపో కార్యాలయ ప్రాంగణంలో చెట్లు నాటారు. అక్కడ నుంచి పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రమాద ఘంటికను ఆవిష్కరించారు. డివిజన్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో రైల్వే జీఎం మాట్లాడుతూ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అన్ని వసతు లు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సైమన్, సీపీఎం గతిశక్తి మనోహర్రెడ్డి, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ జె.వి.అనూష, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియర్ డీసీఎం సీహెచ్.ప్రదీప్కుమార్, సీనియర్ డీఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీఎస్టీఈ జి.రత్నాకర్, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, సీనియర్ డీఈఈ పి.రవితేజ, డీఎస్సీ మధుసూదనరావు పాల్గొన్నారు.
ఆర్ఓబీల నిర్మాణానికి
రూ.572.47 కోట్లు మంజూరు
గుంటూరులోని శ్యామలానగర్, సంజీవయ్యనగర్లలో రెండు ఆర్ఓబీలకుగాను రైల్వే శాఖ రూ.159.59కోట్లు మంజూరు చేయడంపై రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మె ల్యే నసీర్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీతోపాటు గడ్డిపాడు, పెద పలకలూరు, నందివెలుగు, మంగళగిరిల్లో ఆర్ఓబీల నిర్మాణాలకు నిధులు విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.