ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు

Jun 13 2025 5:17 AM | Updated on Jun 13 2025 5:31 AM

నరసరావుపేట రూరల్‌: ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీకే పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. అధికారపార్టీ నాయకులే మట్టిమాఫియా నిర్వహిస్తుండటంతో అధికారులు అటువైపు కన్నైత్తి చూడటం లేదు. పగులు, రాత్రి తేడా లేకుండా భారీ మిషన్‌లతో గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. లారీలతో గ్రావెల్‌ను నరసరావుపేటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ గ్రావెల్‌ వ్యాపారంలో ప్రజాప్రతినిధికి వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 20 అడుగుల మేర తవ్వకాలు జరుపుతుండటంతో సమీపంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతులు అక్రమ తవ్వకాలపై నూనె కోటేశ్వరమ్మ అనే మహిళ జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఎస్సీలకు 2008లో డీకే పట్టాలను ప్రభుత్వం పంపిణీచేసిందని, ఇందులో భాగంగా మాకు ఎకరం భూమిపై పట్టా అందజేసినట్టు తెలిపారు. ఈ భూమికి ఇరువైపులా ఉన్న డీకే పట్టాలను మట్టి మాఫియా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement