జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక

Jun 13 2025 5:17 AM | Updated on Jun 13 2025 5:17 AM

జిల్ల

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక

వేమూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా యువజన విభాగం సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్‌ మెంబరుల పేర్లు పార్టీ కేంద్రం కార్యాలయం విడుదల చేసింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన పీకా సన్నీడియోలు జిల్లా యువజన విభాగ సెక్రటరీగా, కొల్లూరు మండలంలోని విప్పర్ల రవితేజను జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబరుగా నియమించారు. ఈ నియామకానికి సహకరించిన పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు న్యాయవాదుల సమావేశం

పట్నంబజారు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదుల ముఖ్య సమావేశం జరగనుంది. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్‌ ఇన్‌ హోటల్‌లో న్యాయవాదుల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ లీగల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.డి.భగవాన్‌ తెలిపారు. పలు కీలక అంశాలపై చర్చించడంతోపాటు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, లీగల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, మాజీ అసిస్టెంట్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ పార్లమెంట్‌ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్‌, విజయవాడ పార్లమెంట్‌ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డితోపాటు, ముఖ్య నేతలు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. కార్యక్రమానిక పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరు కావాలని సి.డి.భగవాన్‌ పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తెనాలిరూరల్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోపల్లెకె చెందిన కారుమంచి దేవదానం(70) గురువారం పట్టణంలో జరిగిన ఓ దుకాణ ప్రారంభోత్సవానికి తన మోపెడ్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సుల్తానాబాద్‌కు రాగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లోడు లారీ ఢీ కొట్టడంతో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోపల్లె వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ కారుమంచి కిషోర్‌బాబుకు దేవదానం స్వయానా సోదరుడు.

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక 
1
1/2

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక 
2
2/2

జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement