
నాటు సారా నిర్మూలన అందరి బాధ్యత
చీరాల: నాటు సారా నిర్మూలనకు అందరు సహకరించి నాటుసారా రహిత గ్రామంగా చేసేందుకు కృషి చేయాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు జనార్దన్, బి.వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు చీరాల మండలం రామ్నగర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రజలతో మాట్లాడి నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అలానే పలు నాటుసారా కేసులతో పాటు, పీడీ యాక్ట్ ఉన్న ముద్దాయిలతో మాట్లాడారు. నాటుసారా వదలాలని, నూతన జీవనోపాఽధికి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చి వారి వివరాలను సేకరించారు. చీరాల ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.