ఇంజినీరింగ్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

Jun 12 2025 3:17 AM | Updated on Jun 12 2025 3:17 AM

ఇంజినీరింగ్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

ఇంజినీరింగ్‌ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

అద్దంకి: ఇంజినీరింగ్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీ ఇంజినీరింగ్‌ కార్మికులు డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ – ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు సీఐటీయూ అద్దంకి మండల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ నెంబర్‌ 36 ప్రకారం స్కిల్‌ కార్మికులకు రూ. 24000 ఇవ్వాలని.. అన్‌ స్కిల్‌ కార్మికులకు రూ. 21000, రూ. 24500 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చనిపోయిన కార్మికులకు మట్టి ఖర్చులు కింద రూ. 20,000 ఇవ్వాలని కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని.. సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, ఆప్కాస్‌ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, రిస్క్‌ అల్వెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోవు కాలంలో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని తెలియజేస్తూ అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ డి. రవీంద్రకు సమ్మె నోటీసు ఇచ్చారు. అలాగే జూలై 9 దేశవ్యాప్త ఒక రోజు సమ్మె నోటీసు కూడా ఇచ్చామని తెలిపారు. ఇంజినీర్‌ విభాగం యూనియన్‌ నాయకులు ఉసురుపాటి సామేలు, వి, జాన్‌, మారుతి, కోటేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్‌ యూనియన్‌ నాయకులు పి. ఆదాం, జి. భీష్మ, డైలీ కార్మికులు, నాయకులు, రాఘవయ్య, శానిటేషన్‌ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement