
ముగిసిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం
చీరాల రూరల్: చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని వైఎస్సార్ సీసీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు అన్నారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్యాంప్ ఇన్చార్జ్ బొనిగల ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడామైదానంలో గత 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 100 మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా క్రీడాదుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా జైసన్బాబు పాల్గొని మాట్లాడారు. అకుంఠిత దీక్షతో చిన్నారులను చేరదీసి ప్రతిరోజూ సొంత ఖర్చులతో పౌష్టికాహారం అందిస్తూ వారికి ఫుట్బాల్ క్రీడలో మెళకువలు నేర్పించి మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దిన క్యాంప్ ఇన్చార్జ్ ప్రేమయ్యను, క్రీడాకారులకు మంచిగా శిక్షణనిచ్చిన కోచ్లను ఆయన అభినందించారు. శిక్షణ తీసుకున్న చిన్నారులు మంచి క్రీడాకారులుగా మనగలిగి తల్లి దండ్రులకు మంచి పేరుప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. నాలుగు జిల్లాల ప్రాంతీయ ఫుట్బాల్ కోఆర్డినేటర్ నూతలపాటి దేవదాసు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, డాక్టర్ అబ్రహం బ్లెస్సీ, బొనిగల క్రాంతి, ఎరిచర్ల సాల్మన్రాజు, ఎన్. నరేష్, ఎన్. బాలశౌరి, కోచ్ ప్రసన్నకుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.