
ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్న అధికారులు: ఏపీట
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీల కౌన్సెలింగ్ పేరుతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్కు రమ్మని పిలిచిన అధికారులు రాత్రి 8 వరకు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో ఖాళీలను తారుమారు చేశారని, వెబ్ వద్దని పట్టుబట్టి మాన్యువల్ బదిలీలు కోరిన ఉపాధ్యాయులపై విద్యాశాఖ డైరెక్టర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫిరంగిపురం మండలం మొత్తాన్ని ప్రిఫరెన్షియల్ కేటగిరీగా చూపారని పేర్కొన్నారు. నరసరావుపేట మండలం లింగంగుంట్లలో ఉన్న నలుగురిలో ఇద్దరు ప్రిఫిరెన్షియల్ కేటగిరీల్లో పని చేస్తుండగా, మరో రెండూ ఆ కేటగిరీలోనే చూపారని పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్కు సిద్ధం చేసిన జాబితాలు, ఖాళీలు మాన్యువల్ కౌన్సెలింగ్లో ఏ విధంగా మారుతాయని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రేషన్ బియ్యం పట్టివేత
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల హైవే సమీపంలోని యాదవ్ కూల్ డ్రింక్స్ దుకాణం వద్ద పీడీఎస్ బియ్యం బస్తాలు 325 గుంటూరు నుంచి కృష్ణపట్నానికి అక్రమంగా కంటైనర్లో తరలిస్తున్నారు. మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ తన సిబ్బందితో దాడి చేసి బియ్యం బస్తాలను కంటైనర్ వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బాపట్ల డీఎస్ఓగా జమీర్బాషా
బాపట్లటౌన్: బాపట్ల జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి(డీఎస్ఓ)గా జమీర్బాషాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ డీఎస్ఓగా పనిచేస్తున్న విలియమ్స్ను బదిలీపై ఏలూరు జిల్లా డీఎస్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం డీఎస్ఓ జమీర్బాషా బాధ్యతలు చేపట్టారు.