
జిల్లా సీనియర్ ఫుట్బాల్ జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లాస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఫుట్బాల్ జట్లకు ఎంపికై న క్రీడాకారులు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి పల్నాడు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఐఎస్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ సత్తెనపల్లి సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగాయి. ఈ ఎంపికల్లో ఐఎస్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది మెన్, 40 మంది ఉమెన్ ఫుట్బాల్ క్రీడాకారులు హజరయ్యారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావు, షేక్ మస్తాన్వలి, పీడీ శ్రీనివాసరావు, పీడీ రియాజు పాల్గొన్నారు. రిటైర్డ్ పీడీ ఐఎస్ నాగిరెడ్డిని, అతిథులను పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఘనంగా సత్కరించారు. జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు.