
మహిళా సాధికారిత జగన్తోనే సాధ్యం
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళా సాధికారిత కోసం చిత్తశుద్ధితో పనిచేసింది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ను పక్కగా అమలుచేస్తూ చట్టం చేసిన ఘనత జగన్కే దక్కింది. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా మహిళల ఖాతాల్లో జమచేసి మహిళల అభ్యున్నతికి కృషిచేశారు. నిరుపేదలైన మహిళలను సొంతింటి వారిని చేయాలనే లక్ష్యంతో వారి పేరుతో నివేశన పట్టాలు అందజేశారు. –వేల్పుల మీరాబీ,
వైఎస్సార్సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు