
ప్రభుత్వంలో స్పందన కరవు
రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడపటం కూటమి సర్కార్కు పరిపాటిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో మహళలపై దాడులు, అత్యాచారాలు జరిగితే ఏ ఒక్క కేసులో దానికి బాధ్యులను కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవు. వాస్తవాలను పక్కనపెట్టి వక్రీకరణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
–షేక్ అప్సర, మండల ఉపాధ్యక్షురాలు,
బాపట్ల మండలం