జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌

Apr 24 2025 1:33 AM | Updated on Apr 24 2025 1:33 AM

జిల్ల

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌

బాపట్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారుల కృషి ఫలించింది. జిల్లాలో 83.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖాధికారి పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 212 నుంచి 9,235 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8,229 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు 126 ఉన్నాయన్నారు. వీటిల్లో 6,947మందికి గానూ 5,357మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తంగా చూస్తే జిల్లాలో 83.96శాతం ఉత్తీర్ణత సాధించామని డీఈఓ పురుషోత్తం వెల్లడించారు. వీరిలో బాలురు 6,615మంది, బాలికలు 6,971 ఉన్నారని వివరించారు. బాలురు ఉత్తీర్ణత 81.24 శాతం కాగా బాలికలు 86.71శాతం ఉందని ఆయన వివరించారు.

చైతన్య విద్యార్థినికి ఫస్ట్‌ ర్యాంక్‌

బాపట్ల పట్టణంలో శ్రీ చైతన్య విద్యార్థిని శ్రీ ప్రణస్య (596) మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. సరస్వతి స్మారక బాలికల ఉన్నత పాఠశాల (ఎస్‌ఎంజీ) విద్యార్థిని షేక్‌ జహూర 593 మార్కులు, జెమ్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు సీహెచ్‌. హారిక 593 మార్కులు, ఎస్‌. నాగ మనస్వి 592 మార్కులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్‌ఎంజీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, జెమ్స్‌ హైస్కూల్‌ డైరెక్టర్‌ ఆదెళ్ల విజయ్‌ కుమార్‌, శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ మాధురి, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

జిల్లాలో 83.96 శాతం ఉత్తీర్ణత

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌1
1/3

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌2
2/3

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌3
3/3

జిల్లా విద్యార్థులు సత్తా చాటెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement