ఐజీ కార్యాలయంలో జెండా వందనం | - | Sakshi
Sakshi News home page

ఐజీ కార్యాలయంలో జెండా వందనం

Jan 27 2025 8:08 AM | Updated on Jan 27 2025 8:08 AM

ఐజీ క

ఐజీ కార్యాలయంలో జెండా వందనం

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): కలెక్టర్‌ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్‌ ఐజీ కార్యాలయ ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం జరిగింది. జాతీయ జెండాను గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎగురవేశారు. గుంటూరు ఏఎస్పీ (ఏఆర్‌) హనుమంతు, ిసీసీ రాఘవ, ిసీఐ ఆరోగ్యరాజు, ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాల ఉద్యోగ, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం జరిగింది. జాతీయ జెండాను ఎస్పీ సతీష్‌కుమార్‌ ఎగురవేసి జెండా వందనం చేశారు. ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్‌), కార్యాలయ ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, డీఎస్పీలు బి.సీతారామయ్య (ఎస్‌బీ), ఏడుకొండలురెడ్డి (ఏఆర్‌), సబ్బంది పాల్గొన్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నంబూరులో తాత్కాలిక హాల్టింగ్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడసెంట్రల్‌): గుంటూరులోని కాజలో జరుగుతున్న బైబిల్‌ మిషన్‌ సదస్సుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నంబూరు స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు తాత్కాలింగా హాల్టింగ్‌ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నర్సాపూర్‌–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17281), సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015) రైళ్లు నంబూరు స్టేషన్‌లో ఆగనున్నాయి. బైబిల్‌ మిషన్‌ వార్షిక సదస్సు కోసం వేలాదిగా తరలివచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ కాకినాడ టౌన్‌–గుంటూరు మధ్య ప్రత్యేక అన్‌ రిజర్వ్‌డ్‌ రైలును (ప్యాసింజర్‌) నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ టౌన్‌–గుంటూరు ప్రత్యేక రైలు (07223) ఈ నెల 26న ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07224) ఈ నెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరులో బయలుదేరి, అదే రోజు రాత్రి 8.40 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. వయా నిడదవోలు, ఏలూరు మీదుగా నడిచే ఈ రైలుకు అన్ని స్టేషన్లలో ఒక నిమిషం పాటు హాల్టింగ్‌ కల్పించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అదృశ్యం

తెనాలిరూరల్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదరావూరు గ్రామానికి చెందిన కొడాలి చంద్రకాంత్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అతను కనబడకుండా పోయాడు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు.

సాగునీటి సమాచారం

తాడేపల్లి రూరల్‌ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 1716 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్‌ కాలువకు 100 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 239 క్యూసెక్కులు, పశ్చిమ కెనాల్‌కు 180 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 80 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 600 క్యూసెక్కులు నీటిని వదిలారు.

ఐజీ కార్యాలయంలో జెండా వందనం 1
1/2

ఐజీ కార్యాలయంలో జెండా వందనం

ఐజీ కార్యాలయంలో జెండా వందనం 2
2/2

ఐజీ కార్యాలయంలో జెండా వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement