జిల్లా రైతుకు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

జిల్లా రైతుకు పురస్కారం

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

కడప అగ్రికల్చర్‌: పెండ్లిమర్రి మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పి.రాజశేఖర్‌కు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ స్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అభ్యుదయ రైతు’ పురస్కారాన్ని అందజేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) సత్యనారాయణ చేతుల మీదుగా రైతు రాజశేఖర్‌ ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకున్నారు. రైతు పి.రాజశేఖర్‌ సాధించిన ఈ విజయానికి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్‌ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డాక్టర్‌ వి.శిల్పకళ, సిబ్బంది ఆయనను శనివారం ఘనంగా సత్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement