కుక్క అడ్డుగా రావడంతో ఆటో బోల్తా వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్క అడ్డుగా రావడంతో ఆటో బోల్తా వ్యక్తి మృతి

Dec 23 2025 7:06 AM | Updated on Dec 23 2025 12:14 PM

కుక్క తెచ్చిన తంటా!.

కుక్క తెచ్చిన తంటా!.

రాజంపేట : రాజంపేట–నెల్లూరు రహదారిలోని ద్వారకనగర్‌(రాజంపేట శివారు గ్రామం)లో సోమవారం కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు, నక్కనూతలపల్లె తాండాకు చెందిన మూడవత్తు నాగరాజు (45) మృతి చెందాడు. మన్నూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..రాజంపేట నుంచి చక్రంపేటలో కూలి పనులకు ఆటో బయలుదేరింది. ఈ ఆటోలో డ్రైవర్‌తోపాటు 8 మంది ప్రయాణిస్తున్నారు. ద్వారకానగర్‌ సమీపంలోకి రాగానే కుక్క అడ్డుగా వచ్చింది. అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని అదే ఆటోలో చికిత్స నిమిత్తం ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో నాగరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయన రాజంపేట పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు పరిశీలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement