నేడు వైఎస్సార్‌ జిల్లాకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to Visit YSR district on Decembar 24 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ జిల్లాకు వైఎస్‌ జగన్‌

Dec 24 2024 3:56 AM | Updated on Dec 24 2024 4:07 AM

YS Jagan to Visit YSR district on Decembar 24

నాలుగు రోజులపాటు పర్యటన 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.

ఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement