
కులం పేరుతో దూషించారు.. చెప్పుతో కొడతానన్నారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐపై ఎస్పీకి టీడీపీ మహిళా నేత ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయి జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. షాపింగ్మాల్లో జరిగిన వివాదం గురించి మాట్లాడేందుకు ఈనెల 15న పోలీస్స్టేషన్కు వెళ్లానని, సీఐ తన కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరంగా దూషించాడని పేర్కొన్నారు.
మూడు గంటలు స్టేషన్లో నిర్బంధించారని, ఇతర అధికారుల ముందు తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్కు వస్తే చెప్పు తీసుకొని కొడతానని, బ్రోతల్ కేసు నమోదు చేసి లోపల వేస్తానని సీఐ బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యతి్నంచానని వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.