
సాక్షి,విజయవాడ : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. గురువారం విజయవాడ ఎస్సీ,ఎస్టీ స్పెషల్ కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది.
వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపున న్యాయవాది సత్య శ్రీ తన వాదనలు వినిపించారు. ఈ కేసుకు వంశీకి ఎలాంటి సంబంధం లేని తెలిపారు. కేవలం రాజకీయంగా కక్షిసాధింపు చర్యల్లో భాగంగానే కేసుపెట్టారని అన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పీపీ తన వాదనలు వినిపించగా..ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
