తితిదే సమాచారం: శ్రీవారి ఉచిత(సర్వ) దర్శనానికి 24 గంటల సమయం

Today Tirumala Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  అన్ని కంపార్ట్‌మెంట్లు నిండడంతో.. క్యూలైన్ల బయట వేచి ఉన్నారు భక్తులు. ఈ క్రమంలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. 

నేటి(శుక్రవారం) నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఎనభైవ దశకం నుంచి జేష్టాభిషేకం ప్రారంభించారు. ఉత్సవమూర్తుల అరుగుదల గురికావడంతో బింభరక్షనార్థం జేష్టాభిషేకం నిర్వహిస్తారు.

🙏 సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఉత్సవమూర్తులకు కవచాల తొలగిస్తారు. ఉత్సవమూర్తులకు కవచాలు తిలగించి, మరమ్మత్తులు చేపడుతారు.

🙏 మొదటి రోజు వజ్రాభరణాలు, రెండవరోజు ముత్యాల ఆభరణాలు, మూడవరోజు స్వర్ణకవచాలతో  అలంకరణ చేపడతారు. ఎల్లుండి అర్జిత సేవలు రద్దు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top