విషాదం నింపిన పుట్టినరోజు వేడుక

Three Persons Lost Life By Slipped Into Cannal In Kakinada - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : కాకినాడ పట్టణానికి సమీపంలో ఉన్న హంసవరంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు వారి పాలిట శాపంగా మారాయి. వివరాలు.. పృథ్వీ, హరీష్‌, మణికంఠలు ప్రాణస్నేహితులు. శుక్రవారం పృథ్వీ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేద్దామని పోలవరం కాలువ వద్దకు వెళ్లారు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం కాలువలో సరదాగా గడుపుదామని ముగ్గురు కాలువలో దిగారు. అయితే కాలువ లోతు బాగా ఉండడంతో వారు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని వెతికేందుకు కాలువలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. పుట్టినరోజు నాడు సరదాగా గడుపుదామని వచ్చిన ముగ్గురు స్నేహితులు విగతజీవులుగా మారడం అక్కడున్నవారందరిని కలచివేసింది.

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top