సాక్షి, గుంటూరు: గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. కానిస్టేబుల్పై టీడీపీ నేత అశోక్, అనుచరులు దాడి చేశారు. బస్టాండ్లో పిల్లర్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన టీడీపీ మూకలను కానిస్టేబుల్ ఠాగూర్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్ను వెంటాడి మరీ టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరిగి కానిస్టేబుల్పైనే అశోక్ తప్పుడు ఫిర్యాదు చేశారు. అశోక్పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.


