ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం.. దేశంలోనే తొలి స్థానం
విజయవాడ : ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం. సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటిస్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఏపీకి ప్రథమ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్మోహన్రెడ్డిలు ప్రశంసించారు.