ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం | Mother poisoned Three children: incident took place in Proddatur, YSR district | Sakshi
Sakshi News home page

ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Mar 26 2026 11:00 PM | Updated on Mar 26 2026 11:12 PM

Mother poisoned Three children: incident took place in Proddatur, YSR district

సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భువనేశ్వరి అనే ఓ తల్లి  తన ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ మహిళ అత్త అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని చూసి షాక్‌కు గురయింది. స్థానికుల సహాయంతో వెంటనే వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి , ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement