రేపటి నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు

Kanipakam Brahmotsavalu from September 10 onwards - Sakshi

కాణిపాకం (చిత్తూరు): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాకారం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  10వ తేదీ శుక్రవారం  ఉదయం ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్ల కార్యక్రమంతో మొదలయ్యి, 30వ తేదీ గురువారం ఉదయం అభిషేకం, సాయంత్రం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లలో దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top