Krishna Floods: వరదనీటిలో హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు | Hero Sharwanand Grandfather's House Drained in Flood Water - Sakshi
Sakshi News home page

వరదనీటిలో హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు 

Sep 30 2020 8:56 AM | Updated on Sep 30 2020 7:01 PM

Hero Sharwanand Grandfather House In Flood Water - Sakshi

సాక్షి, అవనిగడ్డ: భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. సినీ నటుడు శర్వానంద్‌కు హరిప్రసాద్‌ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్‌ ఇదే భవనంలో గడిపేవారు. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్, సినీ నటుడిగా శర్వానంద్‌ గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్‌ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement