వన్‌టౌన్‌ ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు

Heavy Rains Hit Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటితో జలమయమైన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సైలెన్సర్‌లలోకి నీళ్లు వెళ్లటంతో ఆటోలు, బైక్‌లు మొరాయిస్తున్నాయి. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోని గణపతి రావు రోడ్, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్, నైజం గేట్ సెంటర్ రోడ్లు జలమయం అయ్యాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడతో పాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top