నాకన్నా మీకు చెల్లి అంటేనే ఇష్టం కదా.. నేనేం తప్పు చేశానమ్మా! | Girl Ends Her Life Over Family Issues Visakhapatnam | Sakshi
Sakshi News home page

నాకన్నా మీకు చెల్లి అంటేనే ఇష్టం కదా.. నేనేం తప్పు చేశానమ్మా!

Nov 30 2021 7:55 AM | Updated on Nov 30 2021 10:52 AM

Girl Ends Her Life Over Family Issues Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారన్న కారణంతో జీవిత.. తల్లితో నిత్యం గొడవ పడేది. ఈ క్రమంలో సాయంత్రం కూడా గొడవ పడి గదిలోకి వెళ్లిన జీవిత బయటకు ఎంతకీ రాకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచేసరికి విగతజీవిగా కనిపించింది.

సాక్షి,పెందుర్తి(విశాఖపట్నం): తన కంటే సోదరిని తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారని మనస్థాపం చెంది సుజాతనగర్‌ గోపాలకృష్ణనగర్‌కు చెందిన కె.జీవిత(18) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలనీలో నివాసం ఉంటున్న కె.రాంబాబు, రజని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాంబాబు ఆర్‌ఎంపీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద అమ్మాయి జీవిత డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది.

తన కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారన్న కారణంతో జీవిత.. తల్లితో నిత్యం గొడవ పడేది. ఈ క్రమంలో సాయంత్రం కూడా గొడవ పడి గదిలోకి వెళ్లిన జీవిత బయటకు ఎంతకీ రాకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచేసరికి విగతజీవిగా కనిపించింది. పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement