డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు | Electricity employees strike in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

Oct 6 2025 5:12 AM | Updated on Oct 6 2025 5:12 AM

Electricity employees strike in Andhra Pradesh

సంఘీభావం తెలుపుతున్న నాయకులు

ఈ నెల 15లోగా సమస్యలు పరిష్కరించాలి 

విద్యుత్‌ ఉద్యోగుల హెచ్చరిక

సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూ­ర్పు): విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిం­చకుంటే నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్‌ ఉద్యో­గులు హెచ్చరించారు. విజయవాడలో కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగులతో ఉద్యమ కార్యాచరణ గురించి రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. అక్టోబర్‌ 14న వర్క్‌ టు రూల్‌ పాటి­స్తామని ఏపీ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ చైర్మన్‌ పి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

విద్యుత్‌ సంస్థల్లో 27 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నా­యన్నారు. 1999 ముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రమే పెన్షన్‌ సౌకర్యం ఉందని, తర్వాత వారికి పెన్షన్‌ సౌకర్యం లేదన్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు నగదు రహిత మెడికల్‌ కార్డు ఇవ్వాలన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్‌–2 ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ సరీ్వస్‌ రూల్స్‌ వర్తింప చేయాలని సమావేశంలో తీర్మానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement