ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక | Cm Jagan Sankranti Gift To Grain Farmers | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక

Jan 12 2024 6:35 PM | Updated on Jan 12 2024 6:41 PM

Cm Jagan Sankranti Gift To Grain Farmers - Sakshi

ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి కానుక అందించారు.

సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి.

ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల  మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది.  రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.


 

ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు

Advertisement
 
Advertisement
Advertisement