వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్‌

Chief Minister YS Jagan Visakhapatnam Guntur Tour On Wednesday - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. 

ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్‌ రూ.2,750 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top