ఒకే కార్పొరేషన్‌గా తాడేపల్లి, మంగళగిరి

AP Government Merges Tadepalli Mangalagiri Municipal Corporation As One - Sakshi

సాక్షి, అమరావతి : తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను..అలాగే తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top