ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు... | 326 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు...

Dec 29 2020 7:32 PM | Updated on Dec 29 2020 7:32 PM

326 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 మందికి పాజిటివ్‌గా  నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 881599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.(చదవండి: కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం)

గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7100 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 364 డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 871116 డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించారు.(చదవండి: భారత్‌లో కొత్త స్ట్రెయిన్ కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement