సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గత 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం కేవలం సార్వత్రిక ఎన్నికల వరకే పరిమితమని పవన్ కల్యాణ్ వివరించారు.
స్థానిక ఎన్నికలకు మాత్రం ప్రాంతాల వారీగా వ్యూహాలుంటాయి. ఎక్కడ బలం ఉంటే అక్కడ నుంచి పోటీ చేస్తాం. జనసేన ఎమ్మెల్యేలు లేనిచోట కూటమి ధర్మానికి భిన్నంగా పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతుందన్న పవన్.. జనసేన శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తాం. స్థానిక ఎన్నికల సంసిద్ధతకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.


