
సౌత్జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేత నెల్ల
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ స్టేడియం వేదికగా నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ వన్డే క్రికెట్ టోర్నీ విజేతగా నెల్లూరు జట్టు నిలిచింది. సోమవారం అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ను ఎంచుకున్న అనంతపురం జట్టు 48.5 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో మచ్చా దత్తారెడ్డి 58 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 43, మహేందర్రెడ్డి 58, రాజకుళ్లాయప్ప 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ బరిలో దిగిన నెల్లూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 49.4 ఓవర్లలో 296 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో రేవంత్రెడ్డి 104 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్తో 88 పరుగులు సాధించాడు. పాయింట్ల టేబుల్లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన నెల్లూరు జట్టును విజేతగా ప్రకటిస్తూ ట్రోఫీని ఏడీసీఏ సెక్రటరీ వి.భీమలింగారెడ్డి అందజేశారు.