అధైర్యపడకండి అండగా ఉంటాం
నార్పల: బుక్కరాయసముద్రం చెరువులో హత్యకు గురైన దళిత రమాదేవి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య భరోసానిచ్చారు. సోమవారం వారు బొందలవాడలోని రమాదేవి కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సాయా న్ని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు సెంట్ల ఇంటి స్థలంతో పాటు, నిత్యావసర సరుకులూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రమాదేవి హత్య బాధాకరమన్నారు. హంతకుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు ఎకరాల పొలంతో పాటు రూ.8.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమి చైర్పర్సన్ హరిత, ఎంపీపీ నాగేశ్వరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, మిద్దె కుళ్లాయప్ప, రంగయ్య, అద్దాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి