బుచ్చెయ్యపేట ఎంపీడీవో ఆరోగ్యం విషమం | - | Sakshi
Sakshi News home page

బుచ్చెయ్యపేట ఎంపీడీవో ఆరోగ్యం విషమం

Jun 16 2025 5:34 AM | Updated on Jun 16 2025 5:34 AM

బుచ్చెయ్యపేట ఎంపీడీవో ఆరోగ్యం విషమం

బుచ్చెయ్యపేట ఎంపీడీవో ఆరోగ్యం విషమం

బుచ్చెయ్యపేట: ఎంపీడీవో వి. విజయలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉంది. శనివారం ఆమె బుచ్చెయ్యపేటలో విధులకు హాజరై సాయంత్రం ఇంటికెళ్లారు. రాత్రి తన ఇంట్లో బాత్‌రూమ్‌లో కాలు జారి కింద పడిపోయారు. తలకు గాయమవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. విశాఖలో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె కోమాలో నుంచి బయట పడలేదు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆమె అకస్మాత్తుగా ఆస్పత్రి పాలవడంతో పంచాయతీ సెక్రటరీలు, మండల పరిషత్‌ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎంపీడీవో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విజయలక్ష్మి భర్త మల్లికార్జునరావు పార్వతీపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement