యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే | - | Sakshi
Sakshi News home page

యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే

Jun 22 2025 4:06 AM | Updated on Jun 22 2025 4:06 AM

యోగాన

యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే

● యోగాసానాలు వేసిన ఎంపీ, ఎమ్మెల్యే ● జిల్లా కేంద్రంలో ఘనంగా యోగా దినోత్సవం

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌: యోగాను ప్రపంచా నికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేనని ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలతో కలిసి యోగాసానాలు ఆచరించారు. అనంతరం మాట్లాడారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు. ప్రతిరోజు గంట పాటు యోగాసనా లు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, డీఈవో శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌ పాల్గొన్నారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలో...

యోగాతో ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగా గురువు సంధ్య యోగాసానాలను వివరించారు. ఇందులో జిల్లా మొదటి అదనపు జడ్జి డాక్టర్‌ పి.శివరాంప్రసాద్‌, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి కుమార్‌ వివేక్‌, ఫ్యామిలీ కోర్టు జడ్జి కుమారి లక్ష్మి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జైలులో ...

జైలు పర్యవేక్షణాధికారి అశోక్‌, ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఖైదీలకు యోగాసానాలను నేర్పించారు. అనంతరం యోగా శిక్షకులు కె. సంతోష్‌ను జైలు సూపరింటెండెంట్‌ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జైలర్‌ సూర్య ప్రకాష్‌ , డిప్యూటీ జైలర్‌ రాథోడ్‌ ప్రకాశ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

● ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ నగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, బీజేపీ శ్రేణులతో యోగాసానాలు వేశా రు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, మున్నా, జోగు రవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

● లాఫింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పార్కులో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని యోగా చేశారు.

యోగాతో మానసిక, శారీరక ప్రశాంతత

ఆదిలాబాద్‌టౌన్‌: యోగా ద్వారా మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి ఎస్పీ యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. యువత చెడు మార్గాల వైపు పయనించకుండా యోగా, క్రీడల్లో రాణించాలని సూచించారు. జి ల్లాలో శనివారం నుంచి మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, సీహెచ్‌.నాగేందర్‌, ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ సిబ్బంది, యోగా గురువులు రమేశ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే1
1/1

యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement